నగరంలోని హోటళ్లలో ఐటీ అధికారుల విచారణ

నగరంలోని హోటళ్లలో ఐటీ అధికారుల విచారణ

TG: హైదరాబాద్‌ నగరంలోని పలు హోటళ్లలో ఐటీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల మెహఫిల్, పిస్తా హౌస్, షా గౌస్ హోటళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాల్లో భారీగా నగదు, డాక్యుమెంట్స్ గుర్తించారు. ఉడ్‌బ్రిడ్జ్ హోటల్ ఓనర్ హర్షద్ అలీఖాన్‌ను అధికారులు నిన్న ప్రశ్నించినట్లు సమాచారం.