జిల్లా వాసికి కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ అవార్డు
BHPL: పట్టణ కేంద్రానికి చెందిన పద్మశాలీ సమాజ నాయకుడు రాజేంద్రప్రసాద్ ప్రతిష్టాత్మక కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. పద్మశాలీల ఐక్యత, సామాజిక సేవలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. కాగా ఈనెల 15న తిరుపతిలో జరిగే కార్యక్రమంలో BSA జాతీయ అధ్యక్షుడు రాధాకృష్ణ చేతుల మీదుగా రాజేంద్రప్రసాద్ అవార్డు అందుకోనున్నారు.