జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి
KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు బీ.మనోజ్ మాట్లాడుతూ.. కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఖమ్మం వెళ్లాల్సి వస్తోందని, ఇది పేద విద్యార్థులకు ఆర్థిక భారంగా మారుతోందని తెలిపారు.