కొయ్యూరు మండలంలో నేల కూలిన పూరిల్లు

కొయ్యూరు మండలంలో నేల కూలిన పూరిల్లు

ASR: కొయ్యూరు మండలం వెలగలపాలెంకు చెందిన సుర్ల సింహాచలం అనే వ్యక్తికి చెందిన పూరిల్లు కూలిపోయింది. గత వారం రోజులుగా మండలంలో ఎడతెరపి కురిసిన వర్షాలకు తడిసిపోయి, చెమ్మ చేరడం వల్ల పూరిల్లు నేల కూలిందని గ్రామస్తులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన సింహాచలం కుటుంబం నిలువ నీడ కోల్పోయారన్నారు. బాధితుడికి ప్రభుత్వం నుంచి పక్కా గృహం మంజూరు చేయాలని కోరారు.