జనగణనకు ప్రజలు పూర్తి సహకారం అందించాలి: కలెక్టర్
ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్న జనగణనకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ హరిత గురువారం తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి గణన చేపడతామన్నారు. సంక్షేమ పథకాలు జనాభా ఆధారంగా అమలవుతున్నందున ఖచ్చితమైన సమాచారం అవసరమని వివరించారు. sc.census.gov.in ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని పేర్కొన్నారు.