'బీసీ ఆత్మీయ సదస్సు జయప్రదం చేయాలి'
CTR: ఏప్రిల్ 19న తిరుపతిలో నిర్వహించనున్న బీసీల ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి షణ్ముగం శనివారం పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ సదస్సులో, బీసీల హక్కుల సాధనపై చర్చిస్తామన్నారు. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.