కార్యకర్తలకు, ఓటర్లకు ధన్యవాదాలు: KTR
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులు, జూబ్లీహిల్స్ ఓటర్లకు ధన్యవాదాలంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేసిన విషయం తెలిసిందే.