ప్రజా దర్బార్ ద్వారా సత్వర పరిష్కారం: ఎమ్మెల్యే
కోనసీమ: ప్రజల సమస్యలకు ప్రజా దర్బార్ ద్వారా సత్వర పరిష్కారం చూపడం జరుగుతుందని అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు తెలిపారు. ఆయన అమలాపురంలోని క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 76 మంది సమస్యలను తెలియజేసి అర్జీలు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు