జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా లేదా meekosam.ap.gov.in ద్వారా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితిని వెబ్సైట్లో లేదా టోల్ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చు.