కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్దిలపాలెం హెచ్బి కాలనీలోని శనివారం ఓ వ్యక్తి భవనంపై నుంచి కరెంటు తీగపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.