ఢిల్లీ బ్లాస్ట్.. రైల్వేస్టేషన్లలో విస్తృత తనిఖీలు
TG: ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. GRP, RPF బృందాలు సంయుక్తంగా ఆయా స్టేషన్ల ప్లాట్ఫారాలు, ప్రవేశ మార్గాలు, వెయిటింగ్ హాల్స్లో తనిఖీ చేశాయి. అనుమానాస్పదంగా కనిపించినవారి వివరాలను సేకరించాయి. ఎవరైనా వస్తువులు, బ్యాగ్ వదిలివెళ్లినట్లు గమనిస్తే వెంటనే తమకు తెలియజేయాలని ప్రయాణికులకు సూచించాయి.