VIDEO: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
కోనసీమ: జనగణనను అడ్డుపెట్టుకుని దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారని పి.గన్నవరం సీఐ భీమరాజు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ఫోటోలు తీసేటప్పుడు ఒంటిపై బంగారం ఉంటే పథకాలు రావని నమ్మించి, నగలు తీయించి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వాధికారులు ఓటీపీ అడగరని, ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.