పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

ప్రకాశం: వెలిగండ్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌ను గురువారం కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు.పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్సై కృష్ణ పావనికి సూచించారు. గ్రామాలలో పల్లె నిధులు నిర్వహించి ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలన్నారు.