పామూరులో డ్రోన్ కెమెరా ద్వారా నిఘా

ప్రకాశం: పామూరులో పోలీస్ అధికారులు డ్రోన్ కెమెరా ద్వారా విజిబుల్ పోలీసింగ్ను శుక్రవారం నిర్వహించారు. నేరాలు నియంత్రించడానికి, అసాంఘిక కార్య కలాపాలను అరికట్టడానికి, ట్రాఫిక్ను నియంత్రించడానికి డ్రోన్ వినియోగిస్తున్నామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు.