వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్
PDPL: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గుంటి శ్రావణ్ను పోత్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకుని విచారించగా పలు చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ.. ఆలయాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.