మైనర్ బాలికలపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు
కృష్ణా: విజయవాడలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు మైనర్ బాలికలపై త్రినాథ్ అనే యువకుడు తినుబండారాల ఆశచూపి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికల ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.