VIDEO: పెరిగిన మిర్చి ధరలు.. స్థిరంగా పత్తి ధర

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. మార్కెట్ కమిటీ సభ్యుల వివరాల ప్రకారం.. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,150, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.9,000, క్వింటా పత్తి ధర రూ.7,700 జెండా పాట పలికాయి. నిన్నటితో పోలిస్తే.. ఏసీ మిర్చి ధర రూ.600, నాన్ ఏసీ మిర్చి రూ.400 పెరగగా.. అటు పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.