రెడ్డిపాలెంలో వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై
BPT: చందోలు ఎస్సై శివకుమార్ నేతృత్వంలో పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ఆయన సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, మద్యం సేవించడం వంటివి చేయకూడదని, కార్లలో అనుమతి లేని వస్తువులను రవాణా చేయరాదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.