పేదల ఇళ్లను కూల్చడమేనా ప్రజాపాలన అంటే?

పేదల ఇళ్లను కూల్చడమేనా ప్రజాపాలన అంటే?

KMM: ప్రజా పాలన అంటూ చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఇళ్లను కూల్చడం దుర్మార్గమని అఖిలపక్ష పార్టీల జిల్లా నాయకులు నాగేశ్వరరావు, ప్రకాష్ అన్నారు. ఆదివారం కారేపల్లిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పైసా పైసా కూడా పెట్టి కట్టుకున్న ఇంటిని కూల్చడం సరికాదన్నారు. బాధితులకు న్యాయం చేయాలన్నారు.