బైక్లు ఢీ.. పలువురికి గాయాలు
BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద మంగళవారం ఉదయం రెండు బైక్లు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.