ఒకేషనల్ నూతన భవనాన్ని నిర్మించాలి: PDSU
KMM: తిరుమలయపాలెం మండలం పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ నూతన భవనాన్ని నిర్మించాలని PDSU జిల్లా కార్యదర్శి మస్తాన్ అన్నారు. శుక్రవారం PDSU ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలో మరుగుదొడ్లతో పాటు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై మంత్రి పొంగులేటి వెంటనే స్పందించాలన్నారు.