మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలోని ఎస్జీ కన్వెన్షన్‌లో డీఆర్‌డీఏ, ఐసీడీఎస్, మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. 1200 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.