డీసీసీ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ రెడ్డి నియామకం
NRPT: తెలంగాణ (TPCC) పరిధిలోని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు (DCC) నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నారాయణ పేట జిల్లా అధ్యక్ష బాధ్యతలు K. ప్రశాంత్ కుమార్ రెడ్డికి అప్పగించారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న ఆయనకి జిల్లావ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి.