1.5 కిలోల గంజాయి స్వాధీనం

1.5 కిలోల గంజాయి స్వాధీనం

NTR: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. కండ్రిక జంక్షన్ వద్ద రత్నాకుమార్ వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.