'ఘనంగా జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం'
E.G: జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. దేవరపల్లి చెన్నారావు నేతృత్వంలో భౌతికశాస్త్ర విభాగం 'జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం' ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ మాధురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భావితరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ పౌరుడు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలన్నారు.