రేపటి నుంచి మరో క్రికెట్ పండుగ
రేపటి నుంచి 'అబుదాబీ టీ10 లీగ్' తొమ్మిదో ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. అన్ని జట్ల మధ్య 32 మ్యాచ్లు జరగనున్నాయి. అబుదాబీలో 12 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా ఉండే విధ్వంసకర బ్యాటర్లు పాల్గొననున్నారు. ఈ లీగ్లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా ఆడనున్నారు.