ఆర్థిక క్రమశిక్షణతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది: కోట్ల
NDL: డోన్ టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉందని ఆయన కొనియాడారు. వ్యవసాయం, సాగునీరు, గృహనిర్మాణ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక క్రమశిక్షణతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.