BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4,370 పెరిగి రూ.1,73,080కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,000 పెరిగి రూ.1,58,650 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.3,25,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.