రైల్వే ట్రాక్పై యువకుడు ఆత్మహత్య
ప్రకాశం: బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కృష్టాపురం సమీపంలో రైల్వే ట్రాక్పై ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కొరకు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడు కంభం మండలం చిన్న నల్లకాలువకు చెందిన రంగప్రసాద్గా పోలీసులు గుర్తించారు.