చిన్నారి ప్రాణరక్షణకు జనసైనికుల అభయహస్తం
W.G: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో రాయలం జనసైనికులు చూపుతున్న చొరవ అభినందనీయమని ఎమ్మెల్యే రామాంజనేయులు కొనియాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక వైద్య ఖర్చుల నిమిత్తం సేకరించిన రూ.2.65 లక్షల విరాళాన్ని సోమవారం ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం 'సేవ్ పునర్విక పోస్టర్ ను ఆవిష్కరించారు.