గుంటి గంగమ్మ హుండీ ఆదాయం ఎంత అంటే

గుంటి గంగమ్మ హుండీ ఆదాయం ఎంత అంటే

ప్రకాశం: తాళ్లురు మండలంలోని గుంటి గంగ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా వివిధ రూపాల్లో భక్తుల నుంచి వచ్చిన ఆదాయం సుమారుగా రూ.7.42 లక్షలని ఈవో గుంటపల్లి వాసు బుధవారం తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ.92 వేలు, విరాళాల ద్వారా రూ.1.22 లక్షలు, హుండీల ద్వారా రూ.5.27 లక్షల ఆదాయం వచ్చినట్లు వివరించారు.