తృటిలో తప్పిన బస్సు ప్రమాదం

తృటిలో తప్పిన బస్సు ప్రమాదం

KRNL: ఐజ నుంచి ఎమ్మిగనూరు వస్తున్న ఆర్టీసీ బస్సుకు భారీ ప్రమాదం తృటిలో తప్పింది. నందవరం సబ్‌స్టేషన్ సమీపంలో స్టీరింగ్ వీల్ తెగిపోవడంతో బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకోగా డ్రైవర్‌ను అభినందించారు