585 మార్కులతో టాపర్కు 3 గ్రాముల బంగారం
నంద్యాలలో పదో తరగతి ఫలితాల్లో టాపర్గా నిలిచే విద్యార్థినికి మంత్రి ఎన్ఎండీ ఫరూక్ బహుమతి ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 585 మార్కులు సాధించిన అమ్మాయికి 3 గ్రాముల బంగారం అందజేస్తానన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన సొంత ఖర్చుతో ఈ బహుమతి ఇస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రతిభ ఉన్నదని, కష్టపడి చదవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.