రైతులకు పట్టాదారు పుస్తకాలు

రైతులకు పట్టాదారు పుస్తకాలు

NDL: నందికొట్కూరు మండలం అల్లూరులో ‘మన ఆస్తి–మన హక్కు’ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య, మాండ్ర శివానందరెడ్డి పాల్గొని 630 మంది రైతులకు రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.