తాళాలు పగలగొట్టి చోరీ.. 30 వేలు నగదు మాయం
కోనసీమ: ద్వారపూడి శివారు వేములపల్లికి చెందిన కందుల రాజ్యలక్ష్మి, రమేశ్ దంపతుల కిరాణా షాపులో బుధవారం భారీ చోరీ జరిగింది. పాత సినిమా హాల్ సెంటర్లోని షాపు తాళాలు పగలగొట్టిన దుండగులు సుమారు రూ. 30 వేల నగదును అపహరించారు. ఉదయం పనిమనిషి గమనించి సమాచారం అందించడంతో దొంగతనం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు