రాజగోపురంలో అమ్మవారికి ఏకాదశి పూజలు
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలోని రాజ గోపురం వద్ద వన దుర్గమ్మకు ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్షం కార్తీక శుద్ధ ప్రబోధిని ఏకాదశి సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా మంగళ హారతి నివేద్యం సమర్పించారు.