పసికందును విక్రయించిన కసాయి తండ్రి
NLG: పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్దగట్టు గ్రామంలో శిశువు అక్రమ విక్రయం ఆరోపణలు కలకలం సృష్టించాయి. తల్లి మరణం తర్వాత తండ్రి వద్ద ఉన్న పసికందును డబ్బుల కోసం అమ్మేశాడని అమ్మమ్మ తాతయ్యలు ఆరోపిస్తున్నారు. దీంతో తండ్రి మాత్రం పాప చనిపోయిందని చెబుతుండటంతో అనుమానాలు పెరిగాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలన్ని కుటుంబ సభ్యులు కలెక్టర్ను కోరారు.