ఆయిల్ పామ్తో అధిక లాభాలు
KNR: ఆయిల్ పామ్ సాగుతో రైతులు 4-5 రెట్లు అధిక లాభాలు పొందవచ్చని వి. సైదాపూర్ పాక్స్ ఆధ్వర్యంలో రాయికల్లో జరిగిన అవగాహన సదస్సులో ఎల్ఎస్సీఎస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తెలిపారు. ఆయిల్ పామ్ను 35 ఏళ్లు దిగుబడి ఇచ్చే భవితరాల పంటగా ఆయన పేర్కొన్నారు. డ్రిప్ పరికరాలపై 90-100% సబ్సిడీతో పాటు, ఎకరాకు రూ. 4200 సబ్సిడీని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.