సబ్బవరంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
AKP: సబ్బవరం మండలం గుల్లేపల్లిలో మంగళవారం మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పెందుర్తి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అన్నంరెడ్డి సందీప్ రాజ్ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు.