నవోదయ పాఠశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎంపీ
జగిత్యాల జిల్లాకు కేటాయించిన జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ శాశ్వత భవన నిర్మాణం కోసం కోరుట్ల శివారులోని సర్వే నం.923లో 23 ఎకరాల ప్రతిపాదిత స్థలాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. పాఠశాల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు.