పాక్స్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేడీసీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని KDCC బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ.. సహకార రంగం రైతులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించే బలమైన వేదికగా మారిందని తెలిపారు.