రైల్వే ప్రయాణికులకు GOOD NEWS
రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ట్రైన్లో ప్రయాణించే వృద్ధులు, 45 ఏళ్లకు పైబడిన మహిళలకు స్లీపర్ క్లాస్ రిజర్వేషన్లో లోయర్ బెర్తుల కేటాయింపు ఆటోమేటిక్గా జరుగుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైళ్లలో ప్రతి కంపార్ట్మెంట్లోనూ కొన్ని బెర్తులను వయోధికులు, గర్భిణులు, 45 ఏళ్లకు పైబడిన మహిళలకు కేటాయించినట్లు పేర్కొన్నారు.