బాలికల హాస్టల్లో కేర్ టేకర్ దౌర్జన్యం
NLG: దామరచర్ల గురుకుల హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్లో బాలికలు భోజనం సరిపోక కిచెన్లోకి వెళ్లి అందులో ఉన్న అన్నం తిన్నారు. అది తెలుసుకున్న కేర్ టేకర్ అన్నం ఎవరు తిన్నారంటూ విద్యార్థినిలను 25 నిమిషాల పాటు మోకళ్ళపై కూర్చోపెట్టింది. ఈ ఘటన పై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.