నిషేధిత కలుపు మందు స్వాధీనం
W.G: నిషేధిత కలుపు నివారణ మందు గ్లైసిల్ను జిల్లా వ్యవసాయ శాఖ అధికారలు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. టీ నర్సాపురం మండలం గురవాయి గూడెంకు చెందిన కె.నాగేశ్వరరావు పొలంలో 360 లీటర్ల గ్లైసిల్ మందును పట్టుకున్నారు. అనంతరం నాగేశ్వరరావుపై 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారి జేడీ హబీబ్ బాషా తెలిపారు.