'విద్యతోపాటు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం'

JGL: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని కండ్లపల్లి మోడల్ స్కూల్లో ఆయన రూ.10 లక్షలతో నిర్మించనున్న కొత్త వంటగదికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులను పరిశీలించారు.