వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ప్రారంభం

MLG: యాసంగి సీజన్‌లో రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రారంభించారు. తూకం, రవాణ, మద్దతు ధర సమస్యలకు తక్షణ పరిష్కారం అందిస్తామని తెలిపారు. ప్రతి గింజను కొనుగోలు చేసేలా పూర్తి ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో రైతులకు సేవలందించాలన్నారు.