శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఆదివారం భక్తుల రద్దీతో మంచి ఆదాయం లభించింది. ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టికెట్ల ద్వారా రూ.1,46,446, ప్రసాదాల ద్వారా రూ.1,25,530, అన్నదానం ద్వారా రూ.38,606 ఆదాయం వచ్చింది. మొత్తంగా ఒకే రోజులో దేవాలయానికి రూ.3,10,582 ఆదాయం సమకూరింది.