పేలుళ్ల కుట్ర కేసు.. నిందితులకు పోలీసు కస్టడీ

AP: విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులైన సిరాజ్, సమీర్లకు వారం రోజల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు 10 రోజల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న జిల్లా కోర్టు వారం రోజులు ఇస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.