ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద వస్తోంది. దీంతో అధికారులు శుక్రవారం సాయంత్రం 16 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 59,454 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. కాకతీయ, లక్ష్మి కాల్వలకు నీటి విడుదలను నిలిపేశారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.