అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. కాసేపట్లో శ్రీరామ్లల్లా ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే 10 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని ముస్తాబు చేశారు. సప్తరుషి మందిర దర్శనానంతరం శేషావతార మందిరానికి మోదీ వెళ్లనున్నారు. అనంతరం రామ్లల్లా మందిరాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.